Sunday, April 28, 2024

పేదోళ్ల దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌: ఎమ్మెల్యే కోరుకంటి

తెలంగాణ రాష్ట్రంలోని పేదోళ్లకు దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 1 లక్ష 116 రూపాయలను అందిస్తూ వారి కళ్లల్లో ఆనందం నింపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లాలోని 8వ కాలనీ పట్టణ పరిధిలోని 15,18,19 వ డివిజన్ 14 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందన్నారు.

గత సమైక్య పాలనలో లంబడితాండాలను ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులు ఉండేవని, కెసిఆర్ పాలనలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబురం తీసుకునే పరిస్థితి నెలకొందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల భారం కావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచన చేసి కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని , ఈ పథకం ద్వారా లక్షా నూట పదహార్రూపాయాలు అందించడం జరుగుతుందన్నారు. పేదింటి తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement