Saturday, April 27, 2024

ఇటుక బట్టీ వ‌ల‌స కార్మికుల‌ నిరసన : స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన ఏసీపీ

ప్రతినిత్యం రక్తం పిండేలా చాకిరి చేయించుకుంటూ జీతం ఇవ్వకపోవడం వల్ల పస్తులుంటున్నామని ఇటుక బట్టీ కార్మికులు నిరసనకు దిగారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని అర్అర్అర్ ఇటుక బట్టిలోని ఒరిస్సా కార్మికులు తమ యజమాని తమచే చాకిరి చేయించుకుంటూ జీతం ఇవ్వకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నామని వలస కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏసీపీ సారంగపాణికి వివరించడంతో వారిని స్వరాష్ట్రం పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో కార్మికులు నిరసన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement