Friday, May 3, 2024

పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో టి.బి వ్యాధి నిర్మూలన కరపత్రాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.బి వ్యాధి నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆకు కూరలు, గ్రుడ్లు, పాలు వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. టి.బి వ్యాధి పెరగడం ఆందోళనకరమని అన్నారు. యువతను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement