Friday, April 26, 2024

నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను సంద‌ర్శించిన‌ ఏపీ గవర్నర్‌

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఢిల్లీలో పర్యట‌న‌లో ఉన్నారు. ఆయ‌న‌ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను గవర్నర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో గవర్నర్‌ భేటీ కానున్నారు. మంగళవారం విజయవాడ రాజ్‌భవన్‌కు గవర్నర్‌ చేరుకోనున్నారు. కాగా, గవర్నర్‌ బిశ్వభూషణ్‌.. శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement