Friday, May 3, 2024

నల్ల బ్యాడ్జీలతో నిరసన..

ఎన్‌టీపీసీ: యజమాన్యం నిర్లక్ష్య వైఖరి నశించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ గేటు ముందు మూడో రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాజమాన్యం వెంటనే స్పందించి చర్చలు జరపాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ మెయిన్‌ గేట్‌ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి యజమాన్య నిర్లక్ష్య వైఖరి నశించాలని, వెంటనే చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరించాలన్నారు. జరగబోవు పరిణామాలకు యజమాన్యం కాంట్రాక్టర్లు బాధ్యత వహించాలని జేఏసీగా హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వెల్తురు మల్లయ్య, వెంకట్‌రెడ్డి, కన్నూర్‌ శంకర్‌, బైరం శంకర్‌, అంకిరెడ్డి, ప్రసాద్‌, శ్రీనివాస్‌, నాగరాజ్‌, షేక్‌ ఇమామ్‌, సత్యనారాయణ, రంగ శీను, మహేందర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement