Monday, April 29, 2024

బార్‌ అసోసియేషన్‌ వినతి..

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ పట్టణంలో కోర్టు ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి సుల్తానాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. నూతనంగా ఎన్నికైన సుల్తానాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌, నేల శంకరయ్యలు ఎమ్మెల్యే దాసరిని కోర్టు విషయమై విన్నవించారు. కోర్టు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యే దాసరిని కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోగు రమేశ్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ ఆనంద్‌, సీనియర్‌ న్యాయవాది పడాల శ్రీరాములు, రమేశ్‌బాబు, రవికిరణ్‌, సంధ్యరాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement