Friday, May 3, 2024

బీటీ రోడ్లన్నీ తళతళ లాడాలి : మంత్రి గంగుల

కరీంనగర్ పట్టణంలో వర్షానికి ధ్వంసమైన బీటీ రోడ్డు నిర్మాణ పనులను 2.30 లక్షలతో పునరుద్ధరిస్తున్నట్లు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కమాన్ చౌరస్తాలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ వర్షాలకు ధ్వంసమైన బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయం అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా నగరంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు నిర్మిస్తున్నామని… భారీ వర్షాలతో కొన్ని చోట్ల రహదారులు గుంతలు, కొన్ని చోట్ల ధ్వంసం కావడంతో ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో భక్తులకు నిధులు కేటాయించడం జరిగిందని వెల్లడించారు.

2కోట్ల 30 లక్షలతో నగరంలో14.5 కిలో మీటర్ల ప్రధాన రహదారులలో ధ్వంసమైన రోడ్లన్నీ మరమత్తులు పూర్తి చేస్తామని వెల్లడించారు.. మరమ్మతు పనులన్నీ 15 రోజుల్లో పూర్తిచేసి రోడ్లన్నీ తళతళ లాడే విధంగా చేస్తామని వెల్లడించారు. మరమత్తులన్నీ పూర్తయితే మరో 2 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని నూతనంగా నిర్మించిన రోడ్లు ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు.. బిటి రోడ్లమీద నీరు నిల్వకుండా మునిసిపల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.. రోడ్లమీద నీరు నిలిస్తే ఎటువంటి బీటీ రోడ్ అయినా ధ్వంసం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ సేవా ఇస్లావత్ మున్సిపల్ ఈఈ నాగ మల్లేశ్వర్ రావు , ఆర్&బి ఈఈ సాంబ శివరావు, డిఈ రవీందర్, ఏఈ లక్ష్మణ్ రావు, కార్పొరేటర్లు లెక్కల స్వప్న – వేణుగోపాల్ దిండిగాల మహేష్, గుగ్గిళ్ళ జయశ్రీ -శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, పుట్ట నరేందర్, వంగల పవన్ కుమార్, సుడా డైరెక్టర్ నేతి రవివర్మ ,మిడిదొడ్డి నవీన్ కుమార్ కొలిపాక శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement