Monday, April 29, 2024

అల్గునూర్ జంక్షన్ లో కొలువుదీర‌నున్న అంబేద్కర్ కాంస్య‌ విగ్రహం

కరీంనగర్ నగర సుందరీకరణ పనుల్లో భాగంగా అల్గునూర్ కూడలిని అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు అల్గునూర్ జంక్షన్ మానేరు వంతెన వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహం సిద్ధమైంది. త్వరలోనే విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. బంగారు వర్ణంలో.. చేతిలో భారత రాజ్యాంగంతో సింహాసనంపై ఆసీనుడైన అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement