Thursday, May 16, 2024

భార్య రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

తిమ్మాపూర్‌: తిమ్మాపూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మామిడి నర్సింగ్‌ (38) కుటుంబ కలహాలతో తమ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నర్సింగ్‌కు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల నర్సింగ్‌ యూత్‌ కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడుగా నియామకమయ్యారు. నాలుగు రోజుల క్రితం భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య తిరిగి రాదనే మనస్తాపంతో నర్సింగ్‌ చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందాడని, కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఎల్‌ఎం డి ఎస్‌ఐ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement