Thursday, May 2, 2024

పేదలకు సీఎం సహాయనిధి

ముస్తాబాద్‌: మండలంలోని బంధనకల్‌ గ్రామానికి చెందిన కొమ్మట సత్తవ్వకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 16500ల చెక్కును స్థానిక సర్పంచ్‌ గుర్రం వెంకటేశ్వరి, ఏఎంసి డైరెక్టర్‌ నరేశ్‌లతో కలిసి మండల టీ-ఆరెస్‌ అధ్యక్షుడు బొంపెళ్లి సురేందర్‌రావు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది పేదలకు చేయూతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement