Thursday, May 2, 2024

క‌రోనాతో వీణ‌వంక ఎ ఎస్ ఐ యాద‌గిరి క‌న్నుమూత‌..

కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నఎ ఎస్ ఐ గాజర్ల యాదగిరి. (56) కరోనా వ్యాధితో మృతి చెందారు. ఇటీవల వేములవాడ జాతరకు బందోబస్తుకు ఈనెల ఎనిమిదో తేదీన వెళ్లగా విధులు నిర్వహించారు. అనంతరం తన సొంత గ్రామమైన పెద్దపల్లి కి వెళ్లగా శ్వాస తీయడంలో ఇబ్బంది కలగడంతో కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే అక్కడ నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు . మ‌ర‌ణ‌వార్త‌ విషయం తెలుసుకున్న మండల ప్రజా ప్రతినిధులు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement