Friday, May 3, 2024

నగర పంచాయతీ చైర్మన్ గా మోదుగు ప్ర‌సాద్

తిరువూరు నగర పంచాయతీ చైర్ పర్సన్ గా 15 వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ జనరల్ కు రిజర్వు చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ పదవికి వార్డు కౌన్సిలర్ పోటీ పడినప్పటికీ పట్టణ పార్టీ ప్రసాద్ పేరును ఖరారు చేసింది .రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా 2 వైస్ చైర్మన్ పదవుల భర్తీకి ఆదేశాలు కాపు సామాజిక వర్గానికి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెలుగోటి విజయలక్ష్మి పేరు ఖరారైంది మరో వైస్ చైర్మన్ పదవి భర్తీ చేయాల్సి ఉంది. రేపు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రక్షణ నిధి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement