Thursday, May 2, 2024

కళాకారుడి కుటుంబానికి పరామర్శ

ఇల్లందకుంట: మండలంలోని కనగర్తికి చెందిన ద్రవిడ కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్‌ తల్లి రామంచ కొమరమ్మ ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులను తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్‌, ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్‌లు పరామర్శించారు. కొమురమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కలాల రాజిరెడ్డి, ఎంపీటీ-సీల ఫోరం అధ్యక్షులు మోటపోతుల ఐలయ్య, కనగర్తి సర్పంచ్‌ మట్ట రజిత వాసుదేవరెడ్డి, సిరిసేడు సర్పంచ్‌ ఎండీ.రఫీ ఖాన్‌, తెరాస సీనియర్‌ నాయకులు వీరారెడ్డి, మట్ట బాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామంచ రాజన్న, చంద్రమౌళిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement