Wednesday, May 8, 2024

Karimnagar – అట్టహాసంగా మారథాన్ రన్ .. ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న మారథాన్ రన్ అటహాసంగా ప్రారంభమైంది. ఆదివారం కేబుల్ బ్రిడ్జి వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్ మారథాన్ రన్ ను ప్రారంభించారు. మూడు కిలోమీటర్లు, పది కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల రన్ ను నిర్వహించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం మారథాన్ రన్ లో పాల్గొనేందుకు వచ్చారు.

కరీంనగర్ బెస్ట్ సిటీ

తెలంగాణలోనే కరీంనగర్ బెస్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. మారథాన్ రన్ ను ప్రారంభించిన‌. అనంతరం మాట్లాడుతూ గతంలో గుంతల రోడ్లు ఉండేవని, ప్రస్తుతం గుంతలు లేని అండర్ డ్రైనేజీ సిస్టం పై రోడ్లు ఉన్నాయన్నారు. రాత్రిపూట నగరం విద్యుత్ దీపాలతో జిగేలుమంటుందన్నారు. తెలంగాణకే కాదు దేశానికి మానేరు రివర్ ఫ్రంట్ తలమానికంగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే కరీంనగర్ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. రన్ లో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ ఎల్, సుబ్బారాయుడు, మేయర్ సునీల్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement