Wednesday, May 1, 2024

మూర్చ రోగికి కామినేని వైద్యుల కొత్త జీవితం

హైద‌రాబాద్ లోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో ఆధునాతన న్యూరో సైన్ సేవలతో ప్రముఖ న్యూరో సర్జన్లు సూర్యాపేటకు చెందిన విజయ అనే మహిళకు అవేక్ క్రానియోటమి పక్రియను విజయవంతంగా ముగించి కొత్త జీవితాన్ని అందించారు. కామినేని ఆసుపత్రి ఆవరణలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామినేని ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ విజయ అనే మహిళకు మూర్చ రావడంతో ఆసుపత్రిలో చేర్పించారన్నారు.

పరీక్షల ద్వారా మెదడు లోని ఎడమ మోటారు ప్రాంతంలో పెద్ద గాయం ఉన్నట్లు నిర్ధారించామన్నారు. శస్త్ర చికిత్స అధిక ప్రమాదంతో కూడుకున్నది అయినప్పటికీ , అత్యాధునిక సాంకేతిక ప్రజ్ఞానంతో కూడిన అధునాతన న్యూరో సైన్స్ లభ్యతతో చికిత్స చేసి సానుకూల ఫలితం సాధించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement