Thursday, May 2, 2024

NZB :ఎన్నికల ప్రచారం నిర్వహించిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్

బిక్కనూర్, నవంబర్ 16(ప్రభ న్యూస్)
కామారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. గురువారం మండలంలోని మొట్టట్ పల్లి, తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి, గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు దేశంలోనే 150 కోట్ల మంది జనం కామారెడ్డి వైపు ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. కామారెడ్డి లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, మండల ఎంపీటీసీల పోరం అధ్యక్షులు సాయి రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement