Tuesday, May 7, 2024

Join – కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు

కారేపల్లి నవంబర్12( ప్రభ న్యూస్) ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి చెందిన ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో ఉన్న 15 మంది సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు, కారేపల్లి సొసైటీ చైర్మన్ దు గ్గీనేని శ్రీనివాసరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఈసాల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ బానోత్ పద్మావతి ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీతీర్థం పుచ్చుకున్నారు. .

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పువ్వా ళ్ళ దుర్గాప్రసాద్,రాష్ట్ర నాయకులు పోట్ల నాగేశ్వరావు,రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల,జిల్లా యువజన అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్ , మండేపూడి సత్యనారాయణ, కోటి అప్పారావు, పార్టీ మండల అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్, ఇమ్మడి తిరుపతిరావు,మల్లెల నాగేశ్వరరావు,తోటకూరి రాంబాబు,షేక్ సైదులు,దారావతు భద్రునాయక్,గడ్డం వెంకటేశ్వర్లు, భూక్య జామ్లా తదితరుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement