Wednesday, May 1, 2024

Jeevan Reddy – సిద్దుల గుట్ట శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు…

నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని సిద్దుల పై ఉన్న శివాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పురాతనమైన శివాలయానికి వెళ్లే రహదారిని ఆలయాన్ని అభివృద్ధి పరచారు. ప్రతి సోమవారం భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ట్రస్ట్ పేరిట తన సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తున్నారు.

సోమవారం భక్తులకు ఏర్పాటు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతి ఒక్కరు దైవ భక్తుల పెంపొందించుకోవాలని దైవంతోనే ఏ పనైనా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో సిద్దుల గుట్టను మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement