Monday, April 29, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఎదుట జేసీ దివాక‌ర్ రెడ్డి హ‌ల్ చ‌ల్

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఎదుట హ‌ల్ చ‌ల్ చేశారు. సీఎం కేసీఆర్ ను క‌లిసేందుకు జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌చ్చారు. అయితే సీఎం కేసీఆర్ ను క‌లిసేందుకు అనుమ‌తి లేద‌ని జేసీని పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ కాక‌పోతే కేటీఆర్ ను క‌లుస్తానంటూ జేసీ దివాక‌ర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు ఆయ‌న‌ను పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement