Thursday, May 2, 2024

గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. రెండు కార్లు, న‌గ‌దు సీజ్ చేసిన పోలీసులు

భూపాలపల్లి, (ప్రభన్యూస్ ప్రతినిధి) : గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను భూపాల‌ప‌ల్లి జిల్లాలో పోలీసులు ఇవ్వాల పట్టుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు స‌భ్యుల ముఠా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మి బ్యారేజీ వద్ద ప‌ట్టుబ‌డింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్పి జె. సురేందర్ రెడ్డి విలేక‌రుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర లో ఔరంగాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు కాలె కృష్ణ, కాలె విజయ్, దబడె గోపాల్, సపక మయూర్ రెండు కార్లలో (MH 01 AE 0733, స్విఫ్ట్ , MH 04 GD 9539 (SX4) లో ఒడిశా రాష్ట్రం కలిమెల నుండి మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ కు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వాహనాలను చెక్ చేయగా అందులో 4 కేజీల 130 గ్రాములు గంజాయి, 1 లక్ష 85 వేల రూపాయలు మహదేవ్ పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement