Wednesday, May 8, 2024

బీజేపీలోకి వలసలు.. కాషాయ కండువా కప్పుకున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేసీఆర్ కుటుంబ పాలన, అరాచక పాలనను అంతం చేయాలన్న లక్ష్యంతో చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్‌తో పాటు మరికొందరు ఆలేరు ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ భిక్షమయ్యకు కాషాయ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. ప్రజల పక్షాన, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరడంపై బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాట తప్పుదోవ పట్టించేదేనన్న ఆయన, కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా, ఎదురు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆరోపించారు. కొడుకు పదవి కోసం డాడీ, డాడీ అంటుంటే… ఆయనేమో ప్యాడీ ప్యాడీ అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టి మళ్లించి కాలయాపన చేసి పబ్బం గడుపుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ముడి బియ్యం కొంటామని చెప్పిన మాటలో మార్పే లేదని సంజయ్ నొక్కి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement