Monday, May 6, 2024

భూపాలపల్లిలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 10 పరీక్షా కేందాలలో 2031 మంది విద్యార్థులు సెకండ్ లాగ్వేజ్ ఎపర్-1/ జి.యన్.సి పరీక్షలకు కేటాయించండగా 1845 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 186 మంది విద్యార్థులు (జనరల్, ఒకేశనల్ కలిసి) పరీక్షలు హాజరైయ్యారు. అన్నీ కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. భూపాలపల్లి లోని తేజస్విని గాంధీ జూనియర్ కళాజాల పరీక్షా కేందాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. ఆయా మండల కేంద్రాలలోని అన్ని పరీక్షా కేంద్రాలను మండలాల తహసీల్దార్లు, డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ , సర్కిల్ ఇన్స్పెక్టర్లు పరిశీలించారు.  సిట్టింగ్ స్కాడ్లు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement