Friday, May 17, 2024

ఎవ‌రిని ఉద్ధ‌రించ‌డానికి ఈ స‌భ‌లు-పాద‌యాత్ర‌లు -మంత్రి కేటీఆర్

ఎవ్వడు ఏ సభ పెట్టినా..ఎవ్వడు పాదయాత్ర లు చేసిన మేము బిందాస్….. ఎందుకంటే మంచి చేస్తున్న మా ప్రభుత్వాన్ని కాదు.. మన ప్రభుత్వాన్ని మా ప్రజలే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు అన్నారు మంత్రి కేటీఆర్. మా బాసులు డిల్లీలో లేరు.. తెలంగాణ గల్లీలల్లో ఉండే ప్రజలే మా బాస్ లు అన్నారు.. అంతిమంగా న్యాయనిర్ణేతలు ప్రజలు.. మాకు ప్రజల మీద విశ్వాసం.. ప్రజలకు మా మీద విశ్వాసం.. బంగారు తునుకగా తయారు చేసిన తెలంగాణాను తిరిగద్దల నుండి మా తెలంగాణ ప్రజలకు ఎలా కాపాడుకోవాలో తెలుస‌న్నారు. నేడు రాహుల్ గాంధీ సభ .. పన్నెండు వందల మందిని చంపినందుకు ముక్కు నేలకు రాసి సభ పెట్టుకో ఎవ్వరిని ఉద్ధరించడానికి ఈ సభ అని మండిప‌డ్డారు. ఇప్పుడు తెలంగాణలో తిర‌గ‌డానికి వస్తున్నారు ..వారి పట్ల తెలంగాణ సమాజం ..తెలంగాణ ప్రజలకు ఎలా కాపాడుకోవాలో తెలుస‌న్నారు మంత్రి … తెలంగాణ రక్షణ ..తెలంగాణ సాధికుడితోనే సాధ్యం.. తెలంగాణ కు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం.. జై కేసీఆర్ జై జై కేసీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement