Saturday, May 18, 2024

TS | ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభంకానున్నాయి. వచ్చే నెల 15 వరకు ఇవి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మార్కులు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2032 పరీక్షా కేంద్రాలను ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం, పేపర్లు లీకులు కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement