Friday, April 26, 2024

ఆటో ట్రాలీలోఇంటర్‌ పరీక్షలకు ..

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 15 (ప్రభన్యూస్‌): ఈ చిత్రంలో ట్రాలీ ఆటోలో వెళ్తున్న వారిని చూసి వ్యవసాయ పనులకో.. దినసరి కూలీకో వెళ్తున్నారనుకుంటే పొరపాటే.. వీరు ఇంటర్‌ విద్యార్థినులు.. ఆటో ట్రాలీలో వెళ్తున్నది ఇంటర్‌ పరీక్షలు రాసేందుకే.. బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థినులను ఇలా పరీక్షలు రాసేందుకు ఆటో ట్రాలీలో తరలించడం గమనార్హం. ఇది చూసిన ప్రజలు పరీక్షలు రాసేందుకు ఇలా కూడా వెళ్లొచ్చా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ట్రాలీలో వెళ్తున్న విద్యార్థులను ఆసక్తిగా తిలకించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement