Thursday, May 2, 2024

TS: రెండేళ్లలో తెలంగాణ కాంగ్రెస్ కు పెరిగిన ప్రాధాన్యత.. రేవంత్ రెడ్డి

గత రెండేళ్లలో తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రాధాన్యత పెరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అయితే, ప్రాధాన్యత పెరిగింది వ్యక్తులకు కాదు.. పార్టీకి అని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది జాతీయ నాయకులు వరుసగా తెలంగాణకు వస్తున్నారన్నారు.

ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశాలు పెట్టకుండా తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే తెలంగాణ కాంగ్రెస్‌కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చన్నారు. రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌ నిర్వహించిన సభలు అధికార పార్టీ కూడా చేయలేకపోయిందని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement