Sunday, April 28, 2024

KHM: విప్ రేగా సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని, మల్లారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు, బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇవాళ బీఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి బీఅర్ఎస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారిందన్నారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. సాధారణ ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఅర్ఎస్ పార్టీ గెలుపును అపలేరన్నారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement