Wednesday, May 8, 2024

దేశంలో రైతు వ్య‌తిరేక‌ ప్ర‌భుత్వం న‌డుస్తోంది

దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు.శుక్ర‌వారం పెద్ద‌ప‌ల్లి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ధ‌ర్నాను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బిజెపి పార్టీ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ప్రకటించడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏడేళ్లుగా రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతు పక్షపాతిగా మారారన్నారు. యాసంగి పంటను కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా స్పష్టంగా ప్రకటించాలన్నారు. కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు తెరాస రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వ శాసనమండలి విప్ భానుప్రసాదరావుతో పాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement