Monday, April 29, 2024

రెచ్చిపోతున్న అక్రమార్కులు.. పట్టపగలే ఇసుక అక్రమ రవాణా..

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్న హనుమంతుని వాగులో నుంచి పట్టపగలే కాంట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించరు. డీడీలు అసలే ఉండవు ? ఆదివారం అధికారులు ఉండరని ఇసుక అక్రమాలకు అడ్డగా మారింది. కొందరి అధికారుల అండదండలతో అక్రమ దందా యథేచ్ఛగా జరుగుతుందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మారుమూల ప్రాంతాల్లో పై దృష్టి సారించాలని సహజ వనరులు కాపాడాలని  ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement