Thursday, April 25, 2024

ఎంజాయ్‌మెంట్‌కు అడ్డొస్తున్నాడ‌ని.. భ‌ర్త‌ను ఏం చేసిందో తెలుసా?

ఆమెకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. త‌ను పనిచేసే చోట మ‌రో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య ఇల్లీగ‌ల్ ఎఫైర్‌కు దారితీసింది. త‌మ‌కు అన్ని విధాలా అడ్డొస్తున్న భ‌ర్త‌ను లేపేస్తే ఎంచ‌క్కా ఎంజాయ్ చేయొచ్చ‌న్న ప్లాన్ ప్రకారం భ‌ర్త‌ను ప్రియుడితో హత్య చేయించింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి గోపనపల్లి ఏరియాలో ఈ మ‌ధ్య‌నే జ‌రిగింది.

మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్ శేఖర్‌కు అదే ప్రాంతానికి చెందిన జ్యోతితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ సిటీకి వచ్చారు. గచ్చిబౌలిలోని గోపన్‌పల్లిలో ఉంటున్నారు. శేఖర్ మేస్త్రి పని చేస్తుండగా.. జ్యోతి కూలి పనులకు వెళ్తుండేంది.

..ఇదిలా ఉంటే రాజీవ్‌రెడ్డి అనే వ్యక్తి తెల్లాపూర్‌లో రెండు విల్లాలను కొనుగోలు చేశాడు. అందులో పనుల కోసం శేఖర్, జ్యోతి దంపతులను నియమించుకున్నాడు. అయితే ఈ సమయంలోనే వారికి రాజీవ్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రామచంద్రాపురం ఉస్మాన్‌నగర్‌కు చెందిన మాణిక్యంతో పరిచయం ఏర్పడింది. శేఖర్, జ్యోతితో ఉన్న పరిచయాన్ని అలుసుగా తీసుకున్న మాణిక్యం జ్యోతికి దగ్గరయ్యాడు.

ఈ క్రమంలోనే జ్యోతితో మాణిక్యం ఇల్లీగ‌ల్ ఎఫైర్‌ పెట్టుకున్నాడు. దీంతో శేఖర్, జ్యోతి దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ప్రియుడు మాణిక్యంతో కలిసి భర్తను లేపేసేందుకు రెడీ అయింది.

ప్లాన్ ప్రకారం మాణిక్యం అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం శేఖర్‌కు ఫోన్ చేసి మద్యం తాగేందుకు రావాలని పిలిచాడు. అక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పురుగుల మందు కలిపిన మద్యంను శేఖర్ తాగేలా చేశాడు. అతను కుప్పకూలిన తర్వాత గొడ్డలితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు

- Advertisement -

శేఖర్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మృతుడి ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ జరిపి అసలు విషయాన్ని కనుగొన్నారు. నిందితుడు మాణిక్యంతో పాటుగా మృతుడి భార్య జ్యోతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement