Friday, April 19, 2024

ఫ్యానుకు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది

ఆంధ్రప్రదేశ్ లో నెలకున్న విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని మండిపడ్డారు. ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం నెలకొందని విమర్శించారు. బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా.. తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్రపోతున్న సీఎం జగన్‌లో చలనం లేదని దుయ్యబట్టారు. రూ.200 కోట్టలకు పైగా సొంత మీడియాకు ప్రకటనలు రూపంలో దోచిపెట్టిన జగన్.. బొగ్గు ఉత్పత్తి సంస్థలను చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారుణమన్నారు. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ రెడ్డి బిజీ అవ్వడం వలనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Weather Alart: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement