Friday, April 26, 2024

రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే 25శాతం అడ్మీష‌న్లు ఫ్రీ : రేవంత్ రెడ్డి

రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీగా వస్తాయ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎల్పీ చిట్ చాట్ లో ఆయ‌న మాట్లాడుతూ…యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నామ‌ని కేసీఆర్ అంటుండన్నారు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్ర‌శ్నించారు. టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువును ఎలా అందిస్తారని ? అన్నారు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారన్నారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తే పేదలు బాగుపడుతారన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెక్క లేదని, అందుకే మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ కు హాజ‌రు కాలేద‌న్నారు. పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదని, అయినా వాటిని మూసివేశారన్నారు. పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయని, అయినా వాటిని నియంత్రణ చేయరు.. ఎందుకంటే ఆదాయం ఉంటుంది కాబట్టి…ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసాడన్నారు. చదువును దూరం చేసి గొర్లు – బర్లు- చేపలు ఇస్తుండన్నారు. విద్యకు పెట్టే నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు- సమాజం దృష్టిలో పెట్టుబడి అన్నారు. తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డి లాంటి లీడర్లు పుట్టారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యమ‌య్యాయ‌న్నారు. కేసీఆర్ మనువాది అని, ఉద్యోగుల భర్తీ లేకుండా- ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదన్నారు. దళితబంధు మంచి పథకం – అమలు చేస్తే బాగుంటుందన్నారు. తెలంగాణలో ఎంఐఎం తో పొత్తు పెట్టుకొని యూపీలో ఎంఐఎంకి కాకుండా SP కి ప్రచారం చేస్తారా? అన్నారు. కేటీఆర్ చర్చలు జరపాలంటే సినిమా గ్లామర్ ఉండాలి – అది నా దగ్గర లేదు కదా అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కోసం పార్టీలో కమిటీ వేశారంటే ఆ పార్టీ పని ముగిసిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదన్నారు. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారన్నారు. ఆ కమిటీలు చూస్తేనే అర్థమ‌వుతుంది.. బీజేపీ దివాళ తీసిందని అన్నారు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా? అని నా డౌట్ అని అన్నారు.


మేము శైవులం కాబట్టే- వైష్ణవులు మమ్ములను అవమానిస్తున్నారా ? సమానత్వం అని టైటిల్ పెట్టి- ఒక ఎంపీని- పార్టీ అధ్యక్షుడు గా ఉన్న నాకు రియల్ ఎస్టేట్ ఉద్యోగితో నాకు ఆహ్వానం పలుకుతారా ? అన్నారు. చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి మాకు ఆహ్వానం ఎందుకు రాలేదు ? అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోసం చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారన్నారు. చిన్నజీయర్ స్వామీజీ పై మాకు అపారమైన గౌరవం ఉంద‌ని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను పక్కన పెట్టుకొని తిరిగితే మాకు అనుమానాలు వస్తాయన్నారు. చిన్నజీయర్ స్వామి ల్యాండ్ గ్రాబర్ పక్కన‌ పెట్టుకొని వ్యవస్థను, ఒక కంపెనీ కోసం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మోడీ ఏమి భక్తుడో ఆయనకే తెలియాలన్నారు. చైనా విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్లడం ఏంటో ! అన్నారు. స్వామీజీ అంత గొప్ప కార్యక్రమం – ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేస్తున్నారా ? అన్నారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ ముందు మాత్రం సమానత కనిపించడం లేదన్నారు. ప్రధాని- రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకొని- రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆస్తులను పెంచడానికి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చిన్నజీయర్ స్వామి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యక్తులుంటే ఆయన గౌరవానికి కరెక్ట్ కాదన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చెట్లను నరకడం పై బీజేపీ కూడా సమాధానవ‌ చెప్పాలన్నారు. స్వామీజీని నేను కలిసి ఏమైనా చెప్పాలంటే ఆయన చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యక్తులే ఉంటారని రేవంత్ రెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement