Tuesday, May 14, 2024

దళిత బంధు కోసం డబ్బులడిగితే చెప్పుతో కొట్టండి… పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఓదెల, ఆగస్టు 25 (ప్రభన్యూస్‌): దళిత బంధు మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగితే బట్టలూడదీసి, చెప్పులతో కొట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలియజెశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెలకు వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రామంలోని దళితులు దళిత బంధు అందరికి మంజూరు చేయాలని విన్నవించారు. ఈసందర్భంలో దళిత బంధు మంజూరు చేయిస్తామని కొందరు డబ్బులు అడుగుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే దాసరి ఎవరైనా డబ్బులు అడిగితే బట్టలు విప్పి.. మరీ కొట్టాలన్నారు. ఎలాంటి అపోహలు వద్దని, గ్రామంలో మీరందరూ కూర్చుని ఎవరు అసలైన లబ్ధిదారులో నిర్ణయిస్తే వారికే దళిత బంధును దశల వారీగా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే వారికి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement