Tuesday, April 30, 2024

TS : శివాల‌యంలో విగ్ర‌హాలు ధ్వంసం…

మేడ్చల్ జిల్లా నాచారం శివాలయంలో గుర్తు తెలియని దుండగులు విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆల‌యంలోని నాగదేవత, సుబ్రమణ్యస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు.ఇవాళ ఉదయం కొందరు భక్తులు పూజలు చేసేందుకు ఆలయంలో వెళ్లిన సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది.

స్థానికులు సమాచారంలో నాచారం ఎస్సై , పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఈ దుశ్చర్యకుపాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఆరా తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement