Friday, May 10, 2024

గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మీయ మిత్రుడిని కోల్పోయాను : ఎంపీ నామ

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో తాను ఒక ఆత్మీయ మిత్రుడిని కోల్పోయనని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసానికి వెళ్లిన ఎంపీ నామ నాగేశ్వరరావు గౌతమ్ రెడ్డి పార్దివ దేహం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తగా, ప్రజా సమస్యలపై అవగాహనతో చిన్న వయస్సు లోనే నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గౌతమ్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్టు వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement