Thursday, May 2, 2024

జలవిహార్: వ్యాక్సిన్ తీసుకున్న వారికి డిస్కౌంట్లు

లాక్‌డౌన్ తీసివేయడంతో హైదరాబాద్ నగరంలోని పార్కులు, చారిత్ర‌క ప్రాంతాల‌కు ప‌ర్యాట‌కుల తాకిడి పెరిగింది. సాగ‌ర తీరాన‌.. పీవీ మార్గ్‌లో ఉన్న జ‌ల‌విహార్‌లో చాలా రోజుల త‌ర్వాత సంద‌ర్శ‌కులు బారులు తీరారు. వాట‌ర్ పార్కులో చిన్న‌, పెద్ద‌, యువ‌త జ‌ల‌క్రీడ‌లు ఆడుతూ సేద‌తీరారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌తో జ‌ల‌విహార్‌లో ప్ర‌వేశం క‌ల్పిస్తుండ‌గా, టీకా వేసుకున్న వారికి ప్ర‌త్యేక రాయితీలు ఇస్తున్నారు. వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారు దానికి సంబంధించిన ప‌త్రాలు, యాప్‌లో స్టేట‌స్‌ను చూపిస్తే చాలు వారికి డిస్కౌంట్లు క‌ల్పిస్తున్నామ‌ని, త‌ద్వారా టీకాల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కె.ప్ర‌తాప్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement