Sunday, May 5, 2024

ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన వాణీదేవి…

హైదరాబాద్‌: టిఆర్ ఎస్ అభ్య‌ర్ధిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సుర‌భి వాణీదేవి త‌న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు.. ప‌లువురు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌ల‌సి ఇంటింటికి తిరుగుతూ ఓట్ల‌ను అభ్య‌ర్ధిస్తున్నారు.. దీనిలో భాగంగా ఆమె నేడు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, గంగుల క‌మ‌లాక‌ర్ తో క‌ల‌సి స‌న‌త్ న‌గ‌ర్ లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వాణీ మాట్లాడుతూ, త‌న‌ను గెలిపిస్తే మీ గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. విద్యారంగంలో 35 ఏండ్ల అనుభంవం ఉందని చెప్పారు. అభివృద్ధిని కొనసాగించేందుకు టీఆర్‌ఎస్‌ను బలపర్చాలని ఆమె కోరారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురుగా కాకుండా, విద్యావేత్తగా వాణీదేవిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement