Sunday, May 19, 2024

HYD: రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతి..

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతిచెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున 4గంటలకు న‌గ‌రంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై బోయిన్ పల్లి నుండి రాణిగంజ్ వైపు వెళ్లుతుండగా మార్గమద్యం ఎంజీ రోడ్డులోని ఆజాం హోటల్ ఎదురుగా సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement