Saturday, May 4, 2024

నేడు ‘బోంజోర్‌ ఇండియా ఫ్రాన్స్‌కు పర్యటన’ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : బోంజోర్‌ ఇండియా ఫ్రాన్స్‌కు పర్యటన ఎగ్జిబిషన్‌, ప్రొఫెసర్‌ పరమానంద్‌ దాలాడి 1970 లలో ఫ్రాన్స్‌ సందర్శించినప్పుడు తీసిన ఫోటోలను ప్రదర్శించి చూపుతుంది. ఈ ప్రదర్శన మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శితమవుతుంది. మే 22 వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు ప్రొఫెసర్‌ దాలాడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు. రాబోయే ఫ్రాన్స్‌కు పర్యటన ఎగ్జిబిషన్‌ గురించి హైదరాబాద్‌ అలయన్స్‌ ఫ్రాన్సైజీ డైరెక్టర్‌ డా. శామ్యూల్‌ బెర్థెట్‌ మాట్లాడుతూ… ఫ్రాన్స్‌కు పర్యటన అనే ఈ ఎగ్జిబిషన్‌ హైదరాబాద్‌ వాసులకు ఫ్రాన్స్‌ దేశ చరిత్రలోని ఒక విశిష్ట కాలం ఛాయాచిత్రాలను అందజేస్తుందన్నారు.

ప్రొఫెసర్‌ దాలాడి ప్రతి ఫోటోగ్రాఫునూ చాలా జాగ్రత్తగా, అన్నిటినీ పరిగణించుకున్న తరాత తీశారన్నారు. ఇది ఈ చిత్రాలను చిరస్మరణీయంగా, అర్థవంతంగా చేస్తుందన్నారు. ప్రతి ఫోటోగ్రాఫు ఒక వెయ్యి పదాలతో చక్కని విలువైన ఒక కథను చెబుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement