తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జాతీయజెండాను ఆవిష్కరించి, అమరవీరులను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు రామ్ తాలూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, మహిళా విభాగం రాష్ట్ర ఇంచార్జి కావ్య, యువజన రాష్ట్ర అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement