Tuesday, April 30, 2024

బంగ్లాదేశ్​లో మేయర్లకు స్టడీ టూర్.. ఆయా పట్టణాల్లో పరిశీలన​

మేడిపల్లి, (ప్రభన్యూస్) : స్టడీ టూర్ లో భాగంగా పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి ఇవ్వాల (బుధవారం) బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) ఆధ్వర్యంలో
స్వచ్ఛ సర్వేక్షణ్​పై ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మేయర్లకు స్టడీ టూర్​ నిర్వహించనున్నారు. ఈ స్టడీ టూర్ లో భాగంగా బంగ్లాదేశ్ లోని వివిధ పట్టణాల్లో మేయర్లు పర్యటించనున్నారు. నాలుగు రోజుల స్టడీ టూర్ ముగిసిన అనంతరం మేయర్ వెంకట్ రెడ్డి లోకల్​లో అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement