Monday, April 29, 2024

ఫామ్ కోల్పోయి నిరాశ‌ప‌రుస్తున్న సింధూ.. టాప్ టెన్ నుంచి దిగువ‌కు ర్యాంకింగ్‌

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గతేడాది నుంచి నిరాశ‌ప‌రుస్తోంది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అయితే, గాయాల కారణంగా నాలుగైదు నెలల పాటు ఆటకు దూరంగా ఉంది సింధు. దాంతో ఫామ్ కూడా కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ప్రతి టోర్నీలోనూ నిరాశపరుస్తూ ఆమె ర్యాంక్ దిగజారుతోంది. 2017లో ప్రపంచంలో రెండో ర్యాంక్‌కు చేరుకున్న తెలుగు తేజం ఇప్పుడు 17వ ర్యాంక్‌కు పడిపోయింది. గత పదేళ్లలో ఆమెకు ఇదే అతి త‌క్కువ‌ ర్యాంక్..

తాజా బీడబ్ల్యూఎఫ్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు ఐదు స్థానాలు కోల్పోయి 12 నుంచి 17వ స్థానానికి పడిపోయింది. మరో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ 31వ ర్యాంక్ నుంచి 36వ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 9వ ర్యాంక్‌ నుంచి 10వ ర్యాంక్‌కు పడిపోయాడు. లక్ష్యసేన్ 12, కిదాంబి శ్రీకాంత్‌ల 20 ర్యాంకుల్లో ఎలాంటి మార్పు లేదు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement