Friday, May 17, 2024

Hyderabad: రూ.2కోట్ల విలువైన న‌కిలీ సిగ‌రెట్ల స్వాధీనం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని గోదాముల్లో రూ.2కోట్ల విలువైన న‌కిలీ సిగ‌రెట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ప‌రిధిలోని ట్రూప్ బ‌జార్‌లోని గోదాముల్లో ద‌క్షిణ మండ‌ల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగ‌ళ‌వారం త‌నిఖీలు నిర్వ‌హించారు. గోదాముల్లో భారీగా న‌కిలీ సిగ‌రెట్లు నిల్వ చేసిన‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో మంగ‌ళ‌వారం పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి, రూ. 2 కోట్ల విలువైన న‌కిలీ సిగ‌రెట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ గోదాముల్లో న‌కిలీ సిగ‌రెట్ల‌ను నిల్వ చేసిన వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement