Tuesday, April 30, 2024

TS: ఎల్బీనగర్‌లో ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు

ఎల్బీనగర్, ఫిబ్రవరి 15 (ప్రభ న్యూస్): బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ ఫ్లై ఓవర్ వద్ద బంజారా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వారు చూపించిన మార్గం ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి,నాయకులు రమావత్ రవి నాయక్,లింగం గౌడ్,రామావత్ రాములు నాయక్,ఆంగోత్ శ్రీనివాస్, కేతావత్ గోపాల్ నాయక్,సభావత్ కృష్ణ నాయక్, చౌహాన్, కేతావత్ జగన్,శ్రీశైలం,ఇస్లావత్ లక్ష్మణ్,ఇస్లావత్ గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement