Saturday, April 27, 2024

సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు..

కవాడిగూడ : లోయర్‌ ట్యాంక్ బండ్ ద్వారకామయి కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్‌ శాసనసభ్యులు ముఠా గోపాల్‌, ఆలయ వ్యవస్థాపకులు అంజయ్యసాయి హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ముఠా గోపాల్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాబా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్బంగా సాయిబాబాకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంజయ్యసాయి మాట్లాడుతూ శ్రీ సాయిబాబా ఆయలం నిర్మించి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తయిందని ఆయన వెల్లడించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సారి 25వ వార్షికోత్సవం నిర్వహించడం అనందంగా ఉందని, అంతా ఆ సాయినాధుని కృపేనని ఆయన అన్నారు. బాబాకు అభిషేకాలు, కుంకుమార్చన ప్రత్యేక పూజలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement