Thursday, May 16, 2024

రోడ్డు మరమ్మత్తులు..

సికింద్రాబాద్ : రాంగోపాల్‌పేట డివిజన్‌లో రోడ్డు మరమ్మత్తుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత వారం రోజుల నుండి డివిజన్‌లో గుంతలమయంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేపాడుతున్నారు. డివిజన్‌ కార్పొరేటర్‌ చీర సుచిత్రశ్రీకాంత్‌ ప్రత్యేక దృష్టి సారించి పనులను చేయించడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఇదే విషయంపై కార్పొరేటర్‌ చీరసుచిత్ర మాట్లాడుతూ రాంగోపాల్‌పేట డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే ఏకైక లక్ష్యమన్నారు. ప్రతినిత్యం డివిజన్‌ ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకురావడం వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్యాచ్‌ వర్క్‌ పనులు చేయిస్తున్నామన్నారు. డివిజన్‌లోని పలు రోడ్లు గుంతలమయంగా ఉన్నవాటి దగ్గర పనులు జరిపిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు జిహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడుతున్నమన్నారు. ఇక వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీటి సమస్య ఏక్కడ తలేత్తుకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇప్పటికే జలమండలి అధికారుల దృష్టికి తీసుకె ళ్ళడం జరిగిందన్నారు. మంచినీటి సమస్య ఉన్న ప్రాంతంలో అవసరమైతే ట్యాంకర్ల ద్వార బస్తీలలో నీటిని అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఏ సమస్య ఉన్న ప్రజలు తమ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement