Tuesday, May 14, 2024

Revanthreddy – కాంగ్రెస్ గూటికి చేరిన బిఆర్ఎస్ సీనియ‌ర్ నేత శ్రీహ‌రిరావు..

హైదరాబాద్ – నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీహరి రావు తన అనుచరులు, కార్యకర్తలతో నేడు కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భ‌వ‌న్ లో నేడు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో పిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి వారికి వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, . రాష్ట్ర ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియా గాంధీ అని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అలాగే కాంగ్రెస్ పార్టీలోకి శ్రీహరి రావుని సాదరంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు తప్పక దక్కుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. కొందరు పార్టీని వీడితే నాయకులే ఉండరన్నట్లు వ్యవహరించారని తెలిపారు. కానీ, అంతకంటే బలమైన నాయకులు కాంగ్రెస్ లోకి వచ్చారని తెలిపారు. నిర్మల్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందని చెప్పారు. మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన నియోజక వర్గం నిర్మల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేకపోయారని ఆరోపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement