Friday, May 3, 2024

HYD: ప్రజా పాలన అప్లికేషన్లు రోడ్ల పాలు

ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి. ప్రజా పాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారులు ఇచ్చారు.

హయత్ నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా.. ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకు వెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులు అన్నీ రోడ్ మీద పడటంతో ప్రజలు చూసి ఖంగుతుని ఇవి నీ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement