Friday, April 26, 2024

మంచి ఆహారాన్ని అందించాలి : ఎమ్మెల్యే వివేకానంద్

శుచి, శుభ్రతతో పాటు నాణ్యతతో కూడిన ఆహారాన్ని కస్టమర్లకు అందజేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మస్ట్ ట్రై రెస్టారెంట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వివేక్ తో పాటు స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ…ఆహారం రుచిగా, నాణ్య‌త‌గా అందించాల‌న్నారు. అప్పుడు క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తార‌న్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, బాలాజీ నాయక్, ఇంద్రజిత్ రెడ్డి, NMC ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement