Monday, April 29, 2024

TS : మణికొండ, నార్సింగి క‌మిష‌న‌ర్లుగా ప్రదీప్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో భారీగా మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 40మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సొంత జిల్లాల్లో, 3 ఏళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది.

ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని రెండు మున్సిపాలిటీలలో కమిషనర్ లను బదిలీ చేశారు. కొడంగల్ మున్సిపాలిటీలో పని చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని అక్కడి నుంచి నార్సింగ్ కి ట్రాన్స్ ఫర్ చేశారు. అలాగే మణికొండ మున్సిపల్ కొత్త కమిషనర్ గా ప్రదీప్ కుమార్ బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement